ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 6133 పాజిటివ్ కేసులు, 48 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 30, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,93,484 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 5828 కి పెరిగింది. మరో 7075 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 71,806 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన చిత్తూరులో ఎనిమిది మంది, ప్రకాశంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, గుంటూరులో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కడపలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5828 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 8, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 58,06,558
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 6,93,484
- కొత్తగా నమోదైనా కేసులు : 6133
- నమోదైన మరణాలు : 48
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 6,29,211
- యాక్టీవ్ కేసులు : 58445
- మొత్తం మరణాల సంఖ్య : 5828
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu