తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 19, గురువారం నాడు 1,30,428 మందికి మొదటి డోస్, 33,241 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,63,669 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. అలాగే శనివారం రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో లబ్ధిదారులకు అందించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1.66 కోట్లు (1,66,95,939) దాటినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 1,24,40,618 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 42,55,321 మంది లబ్ధిదారులకు రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇందులో ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా 30,62,023 మంది వ్యాక్సిన్ పొందినట్టు తెలిపారు.
తెలంగాణలో ఆగస్టు 19 వరకు జరిగిన మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వివరాలు:
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 3,03,958
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 2,28,968
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 3,16,512
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 2,10,342
- 45 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు): 57,19,324
- 45 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు): 29,43,567
- 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 61,00,824
- 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 8,72,444
- మొత్తం అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 1,66,95,939
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ