ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 57,672 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,627 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 357, తూర్పుగోదావరి జిల్లాలో 284, ప్రకాశంలో 235, నెల్లూరులో 216 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,56,392 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 17 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, కడపలో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13273 కి పెరిగింది. గత 24 గంటల్లో 2,017 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,21,371 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,748 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ