మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం మోదీ

Governor Lalji Tandon Passes Away, Lalji Tandon Passes Away, Madhya Pradesh, Madhya Pradesh Governor, Madhya Pradesh Governor Lalji Tandon, Madhya Pradesh Governor Lalji Tandon Passes Away, Madhya Pradesh Governor Passes Away

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్ జూలై 21, మంగళవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిశారు. బీజేపీ పార్టీలో క్రమశిక్షణగల నాయకుడిగా లాల్జీ టాండన్ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఉత్తరప్రదేశ్‌ శాసన సభకు మరియు శాసన మండలికి అనేక సార్లు ఎన్నిక అయ్యారు. రాష్ట్రంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 2009లో లక్నో నుంచి లోక్‌సభకు ఎన్నిక అయ్యారు. అనంతరం ఆయన మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా జూలై 20, 2019 న బాధ్యతలు స్వీకరించారు. లాల్జీ టాండన్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర మంత్రులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =