దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 3,92,488 కేసులు, 3689 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,57,457 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,15,542 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్ గడ్ వంటి 10 రాష్ట్రాల్లోనే 72.72 శాతం కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 33,49,644 (17.13%) కు చేరుకుంది. మరో 3,07,865 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,59,92,271 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 81.77 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.10 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే (మే 1 8am–మే 2 8am) :
- మహారాష్ట్ర – 63282
- కర్ణాటక – 40990
- కేరళ – 35636
- ఉత్తరప్రదేశ్ – 30180
- ఢిల్లీ – 25219
- తమిళనాడు – 19588
- ఆంధ్రప్రదేశ్ – 19412
- రాజస్థాన్ – 17652
- వెస్ట్ బెంగాల్ – 17512
- ఛత్తీస్ ఘడ్ – 15902
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన రాష్ట్రాలివే:
- మహారాష్ట్ర – 802
- ఢిల్లీ – 412
- ఉత్తర్ ప్రదేశ్ – 304
- కర్ణాటక – 271
- ఛత్తీస్ ఘడ్ – 229
- గుజరాత్ – 172
- జార్ఖండ్ – 169
- రాజస్థాన్ – 160
- తమిళనాడు – 147
- పంజాబ్ – 138
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ