తెలంగాణ రాష్ట్రంలో మరో 189 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 25, రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,98,453 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి కొత్తగా 129 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,94,911 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 98.81 శాతంగా ఉంది.
కరోనా వలన నిన్న రాష్ట్రంలో మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1632 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,910 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 31, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 19, రంగారెడ్డి జిల్లాలో 16, కరీంనగర్ లో 9, భద్రాద్రి కొత్తగూడెంలో 9, వరంగల్ అర్బన్ లో 8, సంగారెడ్డి లో 8, జగిత్యాలలో 8, రాజన్న సిరిసిల్లలో 7, మంచిర్యాలలో 7 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ