దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలో జూన్ 21, 2021 నుంచి ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద అందరికి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ లో భాగంగా మొదటి 30 రోజులలో (జూలై 21, 2021 నాటికి) 19.5 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులను అందించినట్టు కేంద్రం వెల్లడించింది. ఇక రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 2.88 కోట్లకుపైగా (2,88,73,099) నిల్వలు, వినియోగించని కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అన్ని విధానాల ద్వారా మొత్తం 43.25 కోట్లకుపైగా (43,25,17,330) వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు చెప్పారు. ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి జూలై 21, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 40,36,44,231 డోసులను వినియోగించినట్టు కేంద్రం ప్రకటించింది. అలాగే మరో 53.38 లక్షల (53,38,210) వ్యాక్సిన్ డోసులు పైప్ లైన్ లో ఉన్నాయని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ