భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా 40 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా తాజాగా ఆ సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 45576 పాజిటివ్ కేసులు, 585 మరణాలు నమోదవడంతో గురువారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 89,58,483 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,31,578 కి పెరిగింది. ఇక దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 5 లక్షల కంటే దిగువగానే కొనసాగుతుంది. ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ లో, ఆసుపత్రుల్లో 4,43,303 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత 24 గంటల్లో 48,493 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 83,83,602 చేరుకుంది. కరోనా రికవరీ రేటు 93.58 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.47 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 19, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 89,58,483
- కొత్తగా నమోదైన కేసులు [నవంబర్ 18–నవంబర్ 19 (8AM-8AM)] : 45576
- నమోదైన మరణాలు : 585
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 83,83,602
- యాక్టీవ్ కేసులు : 4,43,303
- మొత్తం మరణాల సంఖ్య : 1,31,578
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ