ఢిల్లీ నగరంలో మూడో దశ కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 7486 కరోనా కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,03,084 కు, మరణాల సంఖ్య 7,943 కి చేరింది. ఇక కొత్తగా కరోనా నుంచి కోలుకున్న 6,901 మందితో కలిపి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 4,52,683 కి చేరింది. ప్రస్తుతం 42,458 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు నవంబర్ 18 నాటికీ ఢిల్లీలో 55,90,654 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ