దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 53,476 కరోనా పాజిటివ్ కేసులు, 251 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,87,534 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,60,692 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, గుజరాత్ వంటి 6 రాష్ట్రాల్లోనే 80.63 శాతం కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలకు (3,95,192) చేరువైంది. మరో 26,490 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,12,31,650 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 95.28 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.37 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు:
కాగా గత 24 గంటల్లో జమ్మూ కాశ్మీర్, గోవా, ఉత్తరాఖండ్, ఒడిశా, లక్షద్వీప్, లద్దాఖ్, సిక్కిం, త్రిపుర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (మార్చి 25, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 23,75,03,882
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,17,87,534
- కొత్తగా నమోదైన కేసులు [మార్చి 24–మార్చి 25 (8AM-8AM)] : 53,476
- నమోదైన మరణాలు : 251
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,12,31,650
- యాక్టీవ్ కేసులు : 3,95,192
- మొత్తం మరణాల సంఖ్య : 1,60,692
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ