భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 31, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 16,38,870 కు కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 55,078 కరోనా పాజిటివ్ కేసులు, 779 కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 35,747 కి చేరింది. దేశంలో మరణాల రేటు 2.18 శాతంగా ఉంది.
ఇప్పటికే కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని 10,57,805 మంది డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 5,45,318 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నపటికి కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 64.55 శాతంగా ఉంది. మరోవైపు ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉండగా, ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో ఇటలీని దాటి భారత్ 5 వ స్థానానికి చేరింది. మొదటి నాలుగు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, మెక్సికో ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu