కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని దాటింది. దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 6 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 6 కోట్లు (6,02,69,782) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
అలాగే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 71వ రోజైన మార్చి 27, శనివారం నాడు 21.5 లక్షలకుపైగా (21,54,170) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 వ తేదీ నుంచి కొమొర్బిడిటీతో సంబంధం లేకుండా 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్టు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. అర్హులైన వారంతా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ