దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం నాడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చి అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ఆయన మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి వెంట ఆయన కుమార్తె కూడా ఉన్నారు. చరిత్రలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ను దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, నిర్వాహకులందరికీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే అర్హులైన ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్రపతి కోరారు. మరోవైపు రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఇప్పటికే కరోనా వాక్సిన్ మొదటి డోసును తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ