దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 30 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 400 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 23,067 కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 25, శుక్రవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 1,01,46,845 కు చేరుకుంది. కరోనాతో మరో 336 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,47,092 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 97 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఒకేరోజులో 24,661 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 97,17,834 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 95.77 శాతం గానూ, మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ప్రస్తుతం 2,81,919 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గడ్, కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైనా 23,067 కేసులలో 77.38 శాతం ఈ 10 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ