ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. “రజనీకాంత్ ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చేరారు. గత 10 రోజుల నుండి ఆయన హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సెట్ లో ఉన్న కొంతమంది వ్యక్తులకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కూడా డిసెంబర్ 22 న కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఫలితం నెగటివ్ గా వచ్చింది. అప్పటి నుండి ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటూ పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు కోవిడ్-19 యొక్క లక్షణాలు లేనప్పటికీ, అతని రక్తపోటు తీవ్రమైన హెచ్చుతగ్గులను చూపించింది. దీంతో తదుపరి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. రక్తపోటు అదుపులోకి వచ్చేంత వరకు అతన్ని ఆసుపత్రిలో ఉంచి పర్యవేక్షిస్తాం. అనంతరం డిశ్చార్జ్ అవుతారు. రక్తపోటు హెచ్చుతగ్గులు, అలసట తప్ప ఆయనకు ఇతర ఏ లక్షణాలు లేవు మరియు ఆరోగ్యం స్థిరంగా ఉంది” అని అపోలో ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ