కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 22,182 కరోనా కేసులు, 178 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,46,228 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 23,165 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 26,563 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 42,36,309 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,86,190 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 27714 యాక్టీవ్ కేసులు ఉండగా, కోజికోడ్ లో 23093, త్రిస్సుర్ లో 21826, మలప్పురంలో 21628, తిరువనంతపురంలో 16413, అలపుజాలో 10824 కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి కేరళలో 3,38,16,015 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ