కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 5,516 కరోనా కేసులు, 39 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,71,135 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 36,087 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 6,705 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 49,71,080 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 63,338 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 8852 యాక్టీవ్ కేసులు ఉండగా, ఎర్నాకులంలో 7646, కోజికోడ్ లో 7161, త్రిస్సుర్ లో 6984, కొల్లంలో 5778, కొట్టాయంలో 5267 కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి కేరళలో 3,89,31,165 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ