మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. అనంతరం హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ముందుగా శనివారం ఉదయం తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. ముందుగా తన ఇంటివద్ద నుంచి అనుచరులతో కలసి గన్పార్కు వద్దకు చేరుకున్న ఈటల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్ కార్యాలయంలో తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. ఈ క్రమంలోనే ఈటల రాజీనామాని ఆమోదిస్తూ ఫైల్పై స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సంతకం చేశారు.
మరోవైపు జూన్ 14, సోమవారం నాడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరి, కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తులా ఉమ, రమేష్ రాథోడ్, ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డి సహా మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ