మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3, శనివారం నాడు కొత్తగా 14,348 కరోనా పాజిటివ్ కేసులు, 278 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,30,861 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 37,758 కు పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికి 70,35,296 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (అక్టోబర్ 3, శనివారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 14,30,861
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 11,34,555
- యాక్టీవ్ కేసులు – 2,58,108
- అక్టోబర్ 3 న నమోదైన కేసులు – 14,348
- అక్టోబర్ 3 న డిశ్చార్జ్ అయినవారు – 16,835
- అక్టోబర్ 3 న నమోదైన మరణాల సంఖ్య – 278
- మొత్తం మరణాల సంఖ్య – 37,758
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu