దేశంలో మహారాష్ట్ర రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 7, మంగళవారం నాడు కొత్తగా 5134 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,17,121 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క ముంబయి నగరంలోనే ఇప్పటికి 86509 కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 224 కరోనా మరణాలు నమోదుకాగా, ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9250 కి చేరింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 3296 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,18,558 కి చేరింది. ప్రస్తుతం 89296 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తి మొదలయినప్పటి నుంచి ఇప్పటివరకు ముంబయిలో మొత్తం 15 లక్షలకు పైగా ప్రజలు క్వారంటైన్లో ఉన్నట్లు బీఎంసీ వెల్లడించింది. అలాగే వీరిలో 13.28 లక్షల మంది 14 రోజుల క్వారంటైన్ గడువు పూర్తి చేసుకున్నట్టు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu