మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 16, మంగళవారం నాడు కూడా 17864 కరోనా కేసులు, 87 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,47,328 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 52996 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 9,510 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 21,54,253 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.77 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.26 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 13,8813 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి మహారాష్ట్రలో 1,77,15,522 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ