కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 9,445 కరోనా కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,38,603 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 29,977 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 6,723 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 48,31,468 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 76,554 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 11955 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 10175, కోజికోడ్ లో 8212, కొల్లంలో 6962, మలప్పురంలో 5512 కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి కేరళలో 3,76,02,787 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ