భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 57 లక్షలు దాటింది. సెప్టెంబర్ 24, గురువారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 57,32,518 కు, మరణాల సంఖ్య 91,149 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 86,508 కరోనా పాజిటివ్ కేసులు, 1129 కరోనా మరణాలు నమోదయ్యాయి. కాగా దేశంలో కరోనా మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.
మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 46 లక్షలు దాటింది. ఒకే రోజులో 87,374 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 46,74,987 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 81.6 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 9,66,382 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu