అగ్రరాజ్యం అమెరికా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో విలవిలలాడుతోంది. అమెరికాలో కరోనా వైరస్ వలన బుధవారం ఒక్కరోజే 3054 మంది మరణించారు. మంగళవారం నాడు కూడా 2,981 మంది మరణించారు. టెక్సాస్, ఇల్లినాయిస్, పెన్సెల్వనియా, మిచిగాన్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, కొలరాడో, ఓహియో వంటి రాష్ట్రాల్లో బుధవారం నాడు పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇక అమెరికాలో ఇప్పటివరకు కోటీ 50 లక్షల మందికి పైగా కరోనా బారినపడగా, 2 లక్షల 90 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైన దేశాల్లో సైతం అమెరికానే మొదటి స్థానంలో కొనసాగుతుంది.
మరోవైపు అమెరికా బయోటెక్ దిగ్గజ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్టెక్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ ఇటీవలే అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ)కు ఫైజర్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫైజర్ వ్యాక్సిన్ కు ఎఫ్డీఏ తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ