తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు, గత అక్టోబర్ లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశ నిర్ణయాల పురోగతి, ప్రాజెక్టులకు కేంద్ర సహకారం సహా పలు అంశాలపై కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. మూడు రోజుల పాటు సాగే ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ