దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1573 కరోనా కేసులు నమోదవడంతో మార్చి 28, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,07,525 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 4 మరణాలు (కేరళలో రికాంసైల్డ్ 4) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,841కి పెరిగింది. కాగా మార్చి 27న 1,20,958 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.30 శాతంగా నమోదైంది.
దేశంలో 10,981 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.79 శాతం:
దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కరోనా కేసులు సంఖ్య 10,981 (0.02%)కి చేరింది. ఇక కొత్తగా 888 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,65,703 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.79 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ (342), గుజరాత్ (301), మహారాష్ట్ర (205), కర్ణాటక (117), ఢిల్లీ (115), తమిళనాడు (102) వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE