దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1150 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,34,217 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 83 మంది మరణించడంతో మరణాల సంఖ్య 5,21,656 కి పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగానూ, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 11,365 (0.03%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 1,194 కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,25,01,196 కు చేరుకుంది.
గత 24 గంటల్లో కేరళ (353), ఢిల్లీ (146), మహారాష్ట్ర (130), మిజోరాం (122), కర్ణాటక (77), హర్యానా (67), ఉత్తర్ ప్రదేశ్ (44), తెలంగాణ (35), వెస్ట్ బెంగాల్ (26), ఒడిశా (22), తమిళనాడు (22) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఏప్రిల్ 9, శనివారం ఉదయం 7 గంటల వరకు 185.55 కోట్ల (1,85,55,07,496) కరోనా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ