శ్రీరామనవమి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరపరిధిలో రెండు రోజుల పాటుగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 9, శనివారం సాయంత్రం 6 గంటల నుండి ఏప్రిల్ 11, సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు.
మరోవైపు శ్రీరామనవమి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర జరగనుంది. ఈ శోభాయాత్రకు హైకోర్టు శుక్రవారం నాడు అనుమతులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర నిర్వహించుకునేలా హైకోర్టు అనుమతి ఇచ్చింది. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో పోలీసులు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటూ, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ