దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.63 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 5,921 పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 5, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,29,57,477 కు చేరుకుంది. గత 24 గంటల్లో మరో 289 కరోనా మరణాలు నమోదవడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,14,878కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 63,878 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.65 శాతం:
దేశంలో ప్రస్తుతం 63,878 (0.15%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 11,651 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,23,78,721 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.65 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. అలాగే మార్చి 4, శుక్రవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 77,19,14,261 కు చేరుకుంది. మార్చి 4న 9,40,905 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ