చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. హస్తకళలు మరియు వస్త్రాలపై జీఎస్టీ రేటు పెంపుతో చేనేత మరియు చేతివృత్తుల సంఘాలపై మోయలేని భారం పడుతుందని, వస్త్రపరిశ్రమ వారసత్వం తీవ్ర ముప్పులో పడుతుందని అన్నారు. ఈ మేరకు లేఖను జత చేస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. “కరోనా దెబ్బతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలి. నేత కళాకారులని గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వచ్చే జీఎస్టీ మండలి భేటీలో కేంద్రం వెనక్కి తీసుకోవాలి” అని నారా లోకేష్ పేర్కొన్నారు.
చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి @nsitharaman గారికి లేఖ రాసాను. కరోనా దెబ్బతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలి.(1/2) pic.twitter.com/t1nmpYqhze
— Lokesh Nara (@naralokesh) March 5, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ