దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా భారత్ లో మరోసారి ఒకేరోజులో కోటిమందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 27, సోమవారం నాడు కోటికి పైగా (1,02,22,525) డోసులను పంపిణీ చేసి రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు దేశంలో ఒక్కరోజు వ్యవధిలో ఐదు సార్లు కోటికి పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.
ఇక దేశంలో ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుండగా సెప్టెంబర్ 28, మంగళవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 87 కోట్లు (87,07,08,636) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటికి 60 ఏళ్లు వయసు దాటిన వారిలో 18.1%, 45-60 ఏళ్ల వయసు వారికి 28.1%, 18-44 ఏళ్ల వయసు వారికి 53.8% మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ