దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజులోనే 4.3 మిలియన్ల మందికిపైగా కరోనా టీకా వేసి భారత్ మరో ఘనతను సాధించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 45 ఏళ్లు పైబడినవారికి వారందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 80వ రోజైన ఏప్రిల్ 5, సోమవారం నాడు ఒక్కరోజే 43 లక్షలకుపైగా (43,00,966) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 39,00,505 లబ్దిదారులకు మొదటి డోస్, 4,00,461 మంది లబ్దిదారులకు సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపారు. అలాగే మంగళవారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 8.31 కోట్లు (8,31,10,926) దాటినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ