దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఫిబ్రవరి 21, ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య కోటి 10 లక్షలు (1,10,85,173) దాటింది. ఇందులో 63,91,544 హెల్త్ కేర్ వర్కర్స్(మొదటి డోస్), 9,60,642 హెల్త్ కేర్ వర్కర్స్(సెకండ్ డోస్), 37,32,987 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోస్) వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు.
అలాగే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన 36 వ రోజైన ఫిబ్రవరి 20, శనివారం నాడు మొత్తం 8,575 సెషన్స్ లో 4,32,931 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 2,56,488 లబ్దిదారులకు (హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్) మొదటి డోస్, 1,76,443 మంది హెల్త్ కేర్ వర్కర్లకు సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పటికి దాకా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 11,52,042, మహారాష్ట్రలో 9,22,728, గుజరాత్ లో 8,82,070, రాజస్థాన్ లో 8,21,059 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 4,93,471, తెలంగాణలో 3,68,132 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ