దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 14,264 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,91,651 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 90 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,56,302 కి పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసులు 1,45,634 (1.32%) కు తగ్గాయి. కొత్తగా మహారాష్ట్ర (6281), కేరళ (4650) మాత్రమే 1,000 కి పైగా కొత్త కేసులను నమోదు చేశాయి. అలాగే గత 24 గంటల్లో గుజరాత్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, జార్ఖండ్, పుదుచ్చేరి, అస్సాం, మేఘాలయ, లక్షద్వీప్, మణిపూర్, మిజోరం, సిక్కిం, లద్దాఖ్, నాగాలాండ్, అండమాన్ అండ్ నికోబర్, త్రిపుర, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
దేశంలో కరోనా రికవరీ రేటు 97.25 శాతం, మరణాల రేటు 1.42 శాతం:
అలాగే మరో 11,667 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,06,89,715 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.25 శాతం గానూ, మరణాల రేటు 1.42 శాతంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 14,264 కేసులలో 85.61 శాతం ఈ 5 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ