గుజరాత్లోని ఒక వ్యక్తికి కరోనా వైరస్ వేరియంట్ ‘ఎక్స్ఈ’ (XE) సోకినట్లు అధికారిక వర్గాలు ఈరోజు వెల్లడించాయి. అలాగే XM వేరియంట్ యొక్క ఒక కేసు కూడా రాష్ట్రంలో కనుగొనబడింది. అయితే ఈ ఇద్దరు రోగుల ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ముంబయిలో కరోనా వైరస్ యొక్క ఎక్స్ఈ వేరియంట్ను గుర్తించినట్లు నివేదిక వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే గుజరాత్లో మరో కేసు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దీనిపై భారతదేశంలోని వైరాలజిస్ట్లు దేశంలో మరో కోవిడ్ వేవ్ కలిగించేంత సామర్ధ్యం దీనికి ఉందని స్పష్టంగా తెలియదని, అప్పుడే దీనిపై ఒక అంచనాకు రాలేమని, అయితే అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియెంట్స్ గుర్తించబడుతున్నప్పటికీ, పరిస్థి ప్రస్తుతానికి అదుపులోనే ఉందని వైద్య నిపుణులు భరోసానిస్తున్నారు. జన్యుసంబంధ నిపుణులు ఈ కొత్త వేరియెంట్స్ పైన పరిశోధనలు ప్రారంభించారు. ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న కొత్త వేరియంట్లను విశ్లేషిస్తున్నారు. ఎక్స్ఈ అనేది కోవిడ్-19 యొక్క ఒమిక్రాన్ BA.1 మరియు BA.2 సబ్లైన్ల రీకాంబినెంట్ అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. గత కొన్ని నెలల క్రితం తొలిసారిగా యూకేలో ఈ కొత్త కోవిడ్ మ్యూటాంట్ ‘ఎక్స్ఈ’ కనుగొనబడిందని, ఇది కోవిడ్-19 యొక్క BA.2 సబ్లినేజ్ కంటే ఎక్కువగా వ్యాపించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ