ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1365 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 22, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,42,073 కు, మరణాల సంఖ్య 14,097 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,466 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,14,180 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,796 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1365):
- చిత్తూరు – 212
- తూర్పుగోదావరి – 210
- ప్రకాశం – 166
- పశ్చిమగోదావరి – 157
- కడప – 153
- నెల్లూరు – 137
- గుంటూరు – 131
- కృష్ణా – 104
- విశాఖపట్నం – 49
- శ్రీకాకుళం – 22
- విజయనగరం – 19
- అనంతపూర్ – 4
- కర్నూల్ – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ