ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 3,556 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో ఏలూరు జిల్లాలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 1, ఎన్టీఆర్ జిల్లాలో 1, శ్రీకాకుళం జిల్లాలో 1 కేసు నమోదవగా, మిగతా 22 జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,607 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,730 గా ఉంది. గత 24 గంటల్లో 15 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 23,04,821 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 56 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,34,73,222 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ