దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడంతో పాటుగా కరోనాకు చికిత్స పొందుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (34) కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతూ మరణించారు. గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశిష్ ఏచూరి గురువారం ఉదయం మృతి చెందినట్టుగా సీతారాం ఏచూరి ట్విటర్ ద్వారా తెలియజేశారు.
“ఈ విషయం తెలియజేయడం ఎంతో బాధగా ఉంది. ఈ రోజు ఉదయం నా పెద్ద కొడుకు ఆశిష్ ఏచూరి కరోనాతో మృతి చెందారు. మాకు ఆశలు కల్పించిన మరియు అతనికి చికిత్స చేసిన వైద్యులు, నర్సులు, ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు మరియు మాకు అండగా నిలిచిన అసంఖ్యాక ఇతరులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని సీతారాం ఏచూరి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ