తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్కుమార్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. నా ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికి ఎటువంటి కరోనా లక్షణాలు లేవు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాను. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. బయటకు వెళ్ళవలసి వస్తే మాస్క్ తప్పనిసరిగా ధరించండి” అని ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ