ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఉచిత హామీలు’ వ్యాఖ్యలపై స్పందించారు. శనివారం బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మన దేశంలో ‘రేవ్డి’లు (ఉచిత హామీలు) ద్వారా ఓట్లు దండుకునే సంస్కృతిని తీసుకురావడానికి కొన్ని చోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ‘రేవ్డి’ సంస్కృతి దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. కాగా ఈ ఉచిత హామీలను రేవ్డితో పోల్చారు ప్రధాని మోదీ. రేవ్డి అంటే ఉత్తరభారతంలో విరివిగా వాడే ఒకరకమైన స్వీట్ వంటకం.
దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. ‘నేను ఉచిత పథకాలు పంపిణీ చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారు. నేను భారతదేశంలోని ప్రజలను ఒకటే అడగాలనుకుంటున్నాను. నేను ఎక్కడ తప్పు చేశాను? ఢిల్లీలో ఇన్ని వస్తువులను ఉచితంగా చేసినప్పటికీ, మన బడ్జెట్ ఇంకా లాభాల్లోనే నడుస్తోందని కాగ్ చెప్తోంది. నన్ను నిందిస్తున్న వారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తమ కోసం ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారు. కేజ్రీవాల్ తన కోసం జెట్లను కొనుగోలు చేయరు, కానీ ఆ డబ్బు ఆదా చేసి ఢిల్లీలో మహిళలు కోసం ప్రయాణాన్ని ఉచితంగా అందిస్తారు’ అని కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ