ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు కొంచెం తగ్గుముఖం పట్టింది. గురువారం నాడు ఢిల్లీలో కొత్తగా 3734 కరోనా కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,82,058 కు, మరణాల సంఖ్య 9424 కి చేరింది. ఇక కొత్తగా కరోనా నుంచి కోలుకున్న 4834 మందితో కలిపి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 5,43,514 కి చేరింది. ప్రస్తుతం 29,120 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు డిసెంబర్ 3 నాటికీ ఢిల్లీలో 65,00,700 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ