గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. 150 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయని, సీనియర్ పోలీసు అధికారులందరూ కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి, ప్రశాంత వాతావరణంలో లెక్కింపు ప్రక్రియ జరిగేలా ప్రణాళికను సమన్వయం చేసినట్టు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనున్నటు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు ఫలితాలు వెలువడ్డాక 48 గంటలపాటు విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్టు సీపీ అంజనీ కుమార్ ప్రకటించారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలనుకునే వారు 48 గంటల తర్వాత ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
GHMC Elections: The arrangements for Counting is getting ready. Today all senior Police Officers visited the Counting Centres and coordinated the plan for a smooth counting process. pic.twitter.com/rHRJKjSi8M
— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) December 2, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ