ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత కొద్దీరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలకు చేరువైంది. నవంబర్ 17, మంగళవారం నాడు కూడా 6396 కరోనా కేసులు, 99 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,95,598 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,812 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 4,421 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 4,45,782 కు చేరుకుంది. ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 89.9 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 42,004 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు మంగళవారం నాటికీ ఢిల్లీ నగరంలో 55,28,422 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ