దేశంలో కరోనా వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో జరగాల్సిన లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో పలు స్థానాల్లో ఉప ఎన్నికలను సెప్టెంబర్ 7 వరకు నిర్వహించాల్సి ఉండగా, కరోనా వైరస్, వరదల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలిపారు. దీంతో బీహార్, అస్సాం, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశంలో పరిస్థితులు అనుకూలంగా మారిన వెంటనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu