దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17, గురువారం నాడు కొత్తగా 24,619 కరోనా పాజిటివ్ కేసులు, 398 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11,45,840 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 31,351 కు పెరిగింది. మరోవైపు మహారాష్ట్రలో గురువారం నాటికీ 56,04,890 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (సెప్టెంబర్ 17, గురువారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు – 56,04,890
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 11,45,840
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 8,12,354
- యాక్టీవ్ కేసులు – 3,01,752
- సెప్టెంబర్ 17 న నమోదైన కేసులు – 24619
- సెప్టెంబర్ 17 న డిశ్చార్జ్ అయినవారు – 19,522
- సెప్టెంబర్ 17 న నమోదైన మరణాల సంఖ్య – 398
- మొత్తం మరణాల సంఖ్య – 31,351
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu