ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటీవల రష్యా-క్రిమియాను కలిపే కెర్చ్ బ్రిడ్జి పేలుడు ఘటన చోటుచేసుకున్న అనంతరం, రోజురోజుకి ఉక్రెయిన్ పై రష్యా దాడులు మరింత తీవ్రతరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కీవ్ (ఉక్రెయిన్) లోని భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్ లో ఉన్న భారత జాతీయులకు/పౌరులకు కీలక సూచన జారీ చేసింది. ఉక్రెయిన్ లో భారతీయులెవరైనా ఉంటే వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని సూచించింది.
“ఉక్రెయిన్ అంతటా క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి మరియు ఇటీవలి కాలంలో పెరిగిన శత్రుత్వాల దృష్ట్యా, భారతీయ పౌరులు ఉక్రెయిన్కు వెళ్లవద్దని/ప్రయాణించవద్దని సలహా ఇస్తున్నాం. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులతో సహా భారతీయ పౌరులందరూ అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా ఉక్రెయిన్ను వీలైనంత త్వరగా విడిచివెళ్లాలని సూచిస్తున్నాం” అని కీవ్ లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY