ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఆయన విజయవాడలోని స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. అయితే అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్య సేవల కోసం ఆయనను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా సీఎస్ సమీర్ శర్మ గుండె సంబంధిత చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, మరికొద్ది రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో సీఎం జగన్ బుధవారం సీఎస్ సమీర్ శర్మకు ఫోన్ చేసి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని తిరిగి రావాలని అభిలషించారు.
ఈ నేపథ్యంలో సమీర్ శర్మ స్థానంలో ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ముత్యాల రాజు ఉత్తర్వులిచ్చారు. సమీర్ శర్మ కోలుకుని డిశ్చార్జ్ అయ్యి తిరిగి వచ్చేవరకు ఆయన స్థానంలో అన్ని బాధ్యతలు విజయానంద్ నిర్వర్తించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీకాలాన్ని ఈ ఏడాది మేలో మరో ఆరు నెలలు పొడిగించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని నవంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY