ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) గురువారం ఛార్జిషీట్ సమర్పించింది. ఈ చార్జిషీట్లో ఆర్యన్ ఖాన్కు ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ముందుగా సిట్ విచారణ చేపట్టిన సందర్భంగా 14 మందిపై ఎన్డిపిఎస్ చట్టం కింద వివిధ సెక్షన్ల ద్వారా కేసు నమోదు చేశారు. అలాగే ఎలాంటి సాక్ష్యాధారాలు లేక పోవడంతో మరో ఆరుగురిపై కేసు నమోదు చేయలేదు. తాజాగా సమర్పించిన ఛార్జిషీట్ లో, అభియోగాలు తొలగించబడిన ఆ ఆరుగురిలో ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో ముందుగానే ఆర్యన్ ఖాన్ మరియు మోహక్ జస్వాల్ మినహా మిగిలిన నిందితులందరూ మాదకద్రవ్యాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడిందని అధికారులు తెలిపారు.
ముందుగా ముంబయి సమీపంలో సముద్రంపై ఓ క్రూయిజ్ షిప్ లో జరుగుతున్న రేవ్ పార్టీ వ్యవహారంలో అక్టోబర్ 2, 2021న ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. జ్యూడిషియల్ కస్టడీ విధింపు అనంతరం ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 8 నుంచి ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. అరెస్ట్ అయిన దాదాపు నెల రోజుల తర్వాత బెయిల్ లభించడంతో అక్టోబర్ 30న ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఈ కేసులో తాజాగా ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ లభించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF