కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల చేస్తున్న ఆందోళన 12 వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనలో భాగంగా డిసెంబర్ 8, మంగళవారం నాడు “భారత్ బంద్” కు రైతులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్టు రైతు సంఘాలు ప్రకటించాయి. రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ సమయంలో భారత్ బంద్ చేపటనున్నట్టు రైతుసంఘాల నాయకులు తెలిపారు. మరోవైపు రైతుల ఆందోళనకు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, ప్రముఖుల నుంచి రోజుకు రోజుకూ మద్దతు పెరుగుతోంది. రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. తమ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులతో రైతులకు మద్ధతుగా బంద్లో పాల్గొంటామని వెల్లడించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ