కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు డిసెంబర్ 8, మంగళవారం నాడు “భారత్ బంద్” కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నాడు జరిగే పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. డిసెంబర్ 9 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, వాయిదా వేసిన పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు ఓయూ అధికారులు తెలిపారు.
మరోవైపు జేఎన్టీయూ పరిధిలో మంగళవారం నాడు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని, ఆ పరీక్షలు డిసెంబర్ 10 న జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఇక తెలంగాణలో రేపు జరగాల్సిన పీజీ కామన్ ఎంట్రన్స్-2020 పరీక్షలను కూడా రద్దు చేశారు. వాయిదా పడిన ప్రవేశ పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్టు సీపీజీసెట్-2020 కన్వీనర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ